Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
అమరావతిఆంధ్రప్రదేశ్

అక్షయపాత్ర భోజనంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఆనందోత్సాహం:-మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థుల ధన్యవాదాలు

అమరావతి, అక్టోబర్ 8:

నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో ట్రిపుల్ ఐటీ మెస్ సేవలపై విద్యార్థుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తక్షణ స్పందనతో మెస్ నిర్వహణ బాధ్యతలను అక్షయపాత్రకు అప్పగించారు.

అక్షయపాత్ర భోజనంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఆనందోత్సాహం:-మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థుల ధన్యవాదాలు

ప్రస్తుతం అందుతున్న ఆహారం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో విద్యార్థులు సంతృప్తిని వ్యక్తపరిచారు. “మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, భోజనం నాసిరకంగా ఉంది” అంటూ గళమెత్తిన విద్యార్థులకు ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభించిందని వారు పేర్కొన్నారు.

“మా సమస్యను స్వయంగా చూసుకుని, మాట నిలబెట్టుకున్న నారా లోకేష్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు,” అని వారు తెలిపారు. ఈ మార్పు శాశ్వతంగా కొనసాగాలని విద్యార్థులు కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button