chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News :అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన-ఎమ్మెల్యే కొండయ్య

చీరాల:15-12-25:-ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చీరాల ఆర్‌ఆర్ రోడ్‌లోని కామధేను కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కొండయ్య గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Chirala Local News :అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన-ఎమ్మెల్యే కొండయ్య

Chirala lo TDPఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఏకైక లక్ష్యంతో పొట్టి శ్రీరాములు సుదీర్ఘ దీక్ష చేపట్టి తన ప్రాణాలను సైతం లెక్కచేయని మహానీయుడని కొనియాడారు. ఆయన త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని, అదే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిందని తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి, ఆత్మగౌరవాన్ని కాపాడటంలో పొట్టి శ్రీరాములు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోరాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, చీరాల మండల టీడీపీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, పిక్కి నారాయణ, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, అధికారులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమరజీవికి నివాళులు అర్పించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker