
బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని కమిషనర్ శ్రీ G. రఘునాధ రెడ్డి గారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మగౌరవం మరియు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన ప్రాణత్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన త్యాగస్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకమని కొనియాడారు.

ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధి కోసం సేవాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ యం. చంద్రమోహన్ గారితో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని అమరజీవికి తమ నివాళులు అర్పించారు.bapatla news







