

చీరాల నియోజకవర్గం నందు పెన్షన్లు పంపిణీ చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు
దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పై భారీ వ్యయo 17 నెలల్లో ₹ 50,763 కోట్లు రూపాయలు ఖర్చు చేశారని ఎమ్మెల్యే గారు తెలిపారు. డిసెంబర్ నెల ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం సాయి కాలనీ రామన్నపేట చీరాల పట్టణం 5వ వార్డు నందు పాల్గొని వృద్ధులకు మహిళలకు వికలాంగులకు 4000, 6000 లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ పథకం అమలు చేయడం లేదని ఒక్క కూటమి ప్రభుత్వంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీన అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.







