Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local news:అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదలచెయ్యాలి-సిఐటియు, కెవిపిఎస్

vijayawada:01-11-25:-అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్సిఐటియు, కెవిపిఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభండాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికుల తొమ్మిది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, కెవిపిఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి.ఉదయం దీక్షకు ప్రారంభం పలికిన కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మృతి వనం కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.

Vijayawada Local news:అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదలచెయ్యాలి-సిఐటియు, కెవిపిఎస్

తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయం” అని అన్నారు.వేతనాల సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు నెలల తరబడి వేతనాల కోసం పోరాడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. “కుటుంబాలు ఎలా గడవాలి? దీనిపై ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి” అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనాన్ని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దాన్ని వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మాల్యాద్రి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సిఐటియు, కెవిపిఎస్ ఉద్యమానికి అండగా ఉంటుందని తెలిపారు.

మొదటి రోజు రిలే నిరాహార దీక్షలను సాయంత్రం సిఐటియు సెంట్రల్ సిటీ నాయకుడు యం. సోమేశ్వరరావు జ్యూస్ ఇవ్వడం ద్వారా విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు సెంట్రల్ అధ్యక్షులు కె. దుర్గారావు, సిఐటియు నాయకులు యం. బాబురావు, వై. సుబ్బారావు, అలాగే అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికులు పి. సునీత, పి. విజయ్ కుమారి, పి. మేరీ, ఎం. సుజాత, యం. దీపిక, కె. అనూష, పి. సత్యవతి, కె. ధనలక్ష్మి, సి.హెచ్. మల్లిక, కె. హరిత, ఎల్. తేరోజమ్మ, ఎస్.కె. జుబేదా తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button