Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

NTR VIJAYAWADA News :అణగారిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే కృషి-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

విజయవాడ: :28-11-25:-అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలేనని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. పూలే వర్థంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్ర ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు అర్పించి నివాళులు తెలిపారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన మంత్రి సవిత మాట్లాడుతూ… దేశం గర్వించదగ్గ సంఘసంస్కర్తల్లో మొదటి వరుసలో నిలిచే మహాత్ముడు పూలేనని అన్నారు. మహారాష్ట్ర పూణేలో జన్మించిన పూలే అంటరానితనం నిర్మూలన, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళా సాధికారత కోసం అపారమైన పోరాటం చేశారన్నారు. దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించి, అన్ని కులాలకూ ప్రవేశం కల్పించిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు.

NTR VIJAYAWADA News :అణగారిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే కృషి-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

వితంతు పునర్వివాహాలపై సమాజంలో చైతన్యం తీసుకువచ్చి… స్వయంగా అనేక వితంతువుల వివాహాలు జరిపించడం ద్వారా పూలే సమానత్వానికి మార్గదర్పకులయ్యారని మంత్రి అన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తోందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయన్నారు. పూలే పేరుతో బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత కూడా టీడీపీదేనని మంత్రి సవిత వివరించారు.ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకటగురుమూర్తి, డూండీ రాకేశ్, పేరేపి ఈశ్వర్, బ్రహ్మ చౌదరి, యాటగిరి రాంప్రసాద్, యర్రబోతు రమణారావుతో పాటు డైరెక్టర్లు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker