chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)

ANANTHASAGARAM NEWS:అనంతసాగరంలో వైభవంగా ఫైజానే రంజాన్ ఇఫ్తార్ విందు

  • మద్రసా-ఎ-మష్కూరియాలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
  • హాజరైన ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, వివిధ ప్రాంతాల భక్తులు
  • రంజాన్ విశిష్టతను వివరించిన పీఠాధిపతులు

అనంతసాగరం: మండల కేంద్రమైన అనంతసాగరంలోని మద్రసా-ఎ-మష్కూరియాలో ‘ఫైజానే రంజాన్’ ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ జరిగింది. సూఫీ మత గురువులు హజరత్ సయ్యద్ షా సాని సాహెబ్ ఖిబ్లా, హజరత్ సయ్యద్ షా మజీద్ అలీషా ఖాదరీ సాహెబ్ పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తరలివచ్చిన వేలాది మంది భక్తులకు, అతిథులకు నిర్వాహకులు భారీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ప్రభాకర్ రెడ్డి దర్గాను సందర్శించి, నిర్వాహకులను ప్రత్యేకంగా కొనియాడారు. అనంతరం మద్రసాలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు బహుమతులు ప్రదానం చేసి వారిని ఉత్సాహపరిచారు.

భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు.. మండల ప్రభుత్వ ఖాజీ సయ్యద్ తన్వీర్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొని మష్కూరి బాబా సన్నిధిలో సలాం సమర్పించారు. అనంతరం పవిత్ర ఖురాన్ తిలావత్ (పారాయణం) చేశారు. వేలాది మంది మురీదులు, మష్కూరి బాబా శిష్యులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు సాని సాహెబ్, మజీద్ సాహెబ్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలోనే ఖురాన్ అవతరించిందని, ఈ నెలలో చేసే ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని భక్తులకు వివరించారు.

ఈ విశేష ఇఫ్తార్ విందు మరియు ప్రార్థనల్లో స్థానికులతో పాటు విజయవాడ, గుడివాడ, చీరాల, పర్చూరు, వేటపాలెం, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దర్గాను దర్శించుకుని మష్కూరి బాబా ఆశీస్సులు పొందారు.http://POTTI SRIRAMULU NELLORE DISTRICT NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker