ఆంధ్రప్రదేశ్
ANDHRA PRADESH NEWS: మార్గదర్శి స్కాంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
YSRCP MP MIDHUN REDDY IN PARLIAMENT
మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కాంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మిథున్ రెడ్డి లోక్సభలో బడ్జెట్ పై చర్చలో భాగంగా మాట్లాడారు.’ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది.మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఈడీ ఏం చేస్తోంది. 2 వేల 600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నారా.. కేంద్రం దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.