Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

ANR kalasalaku:ఏఎన్ఆర్ కళాశాలకు వజ్రోత్సవం… డిసెంబర్ 16 నుంచి మూడు రోజుల వేడుకలు

గుడివాడ, నవంబర్ 5:-గుడివాడలోని ప్రసిద్ధ విద్యాసంస్థ ఏఎన్ఆర్ కళాశాల ఈ సంవత్సరం తన వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 16, 17, 18 తేదీలలో ఈ వేడుకలు జరగనున్నాయని కళాశాల కమిటీ సెక్రటరీ & కరస్పాండెంట్ కె.ఎస్. అప్పారావు, కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్, కార్యదర్శి డా. సూరపనేని శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డా. పి.జె.ఎస్. కుమార్ తెలిపారు.వారు మాట్లాడుతూ—1950లో ఆవిర్భవించిన ఏఎన్ఆర్ కళాశాల 75 ఏళ్ల ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కొని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నత పదవుల్లో కొనసాగుతూ కళాశాల పేరు మరింత వెలుగొందిస్తున్నారని తెలిపారు.

ANR kalasalaku:ఏఎన్ఆర్ కళాశాలకు వజ్రోత్సవం… డిసెంబర్ 16 నుంచి మూడు రోజుల వేడుకలు

వజ్రోత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పట్లో రైతులు పెద్దమనసుతో 15 ఎకరాలు విరాళంగా ఇవ్వడం, ఏఎన్ఆర్ కుటుంబం నగదు సహాయం అందించడంతో కళాశాల స్థాపించబడిన విషయాన్ని గుర్తుచేశారు

.డిసెంబర్ 16న రైతుల కోసం రైతు సదస్సు, 17న పూర్వ విద్యార్థుల సత్కారం, 18న ప్రధాన వజ్రోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆ రోజున మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button