
బాపట్ల జిల్లా:- వేటపాలెం మండలంలోని ఆమోదగిరి పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సన్మాన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెడబలిమి శేఖరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తారని పేర్కొన్నారు.Chirala Local News
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కారంచేడు మండల విద్యాశాఖ అధికారి గోపతోటి శ్యాంసన్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే ఆలోచనను మొదటగా గౌతమ బుద్ధుడు వ్యక్తం చేశారని తెలిపారు. అనంతరం జ్యోతిరావు పూలే మహిళలకు విద్యను అందించేందుకు కృషి చేశారని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు, రక్షణ కల్పించారని వివరించారు.
ఈ కార్యక్రమంలో వై రత్నం, మురళీకృష్ణ, అశోక్ కుమార్, బట్ట శివప్రసాద్, కే. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మహిళా ఉపాధ్యాయినులు ఎం. రాజ్యలక్ష్మి, బి. పద్మావతి, కే. శాంతి, పి. యమునకుమారి, కృష్ణకుమారి, ఎస్. శివపార్వతి లను ఘనంగా సన్మానించారు. చివరగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ముగిసింది.







