ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవని సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైసిపి పాలనలో విమర్శలు గుప్పించారు.
గత ఐదేళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది. ఆ దారుణాలను ప్రజలు వెంటనే తెలుసుకొని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు” అని తెలిపారు. “ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల ముఖాల్లో ఆనందం కన్పిస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి ప్రతినెలా ఒకటోతేదీనే ఇంటికెళ్లి పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. దివ్యాంగుల పింఛన్లను రూ.6వేలకు పెంచాం. కిడ్నీ, తలసీమియా రోగులకు రూ.10వేలు ఇస్తున్నాం. తీవ్ర వ్యాధులతో కదల్లేని వారికి రూ.15వేలు ఇస్తున్నాం. పింఛన్ల కోసం ఏటా రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.