chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

AP LATEST NEWS: అంజుమన్ భూముల కోసం పోరాటం

MUSLIM LEADERS AGITATION IN GUNTUR

మంగళగిరిలోని అంజుమన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా గుంటూరు పాత బస్టాండ్ వద్ద అంజుమన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్, సిపిఐ నేత షేక్ వలి, ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు.. మంగళగిరిలోని అంజుమన్ భూములను డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకోవాలి అనుకుంటుంది.. అంజుమన్ భూములను డెవలప్మెంట్ కి ఇస్తే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి. నేను ఎవరికైనా సమాధానం చెప్పగలను, నాకు అంత ధైర్యం ఉంది.. మీ ఇష్టాలను, అయిష్టాలను తెలియజేయండి అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. వైఎస్సార్సీపీ నేత షేక్ గులాం రసూల్ మాట్లాడారు. మంగళగిరిలోని అంజుమన్ భూములను కూటమి ప్రభుత్వం తీసుకునేందుకు విడుదల చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. నారా లోకేష్ పీఏ గుంటూరు కలెక్టర్ కు అంజుమన్ భూమి కావాలి అని లేఖ స్వయంగా లేఖ రాశారు. అంజుమన్ భూమిని తీసుకునే హక్కు కూటమి ప్రభుత్వానికి ఒక్క శాతం కూడా లేదు. అంజుమన్ భూమిని లాక్కోవాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రసంగాలలో మైకులు ఆపవచ్చు.. కానీ ముస్లింల గొంతు నొక్కలేరు. అంజుమన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతి రాజధాని కోసం తీసుకున్న వేల ఎకరాల భూమిలోనే ఇంతవరకు అభివృద్ధి లేదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు గుండెపోటులతో మృతి చెందే పరిస్థితి వచ్చింది. అంజుమన్ భూమిలో గుప్పెడు మట్టి కూడా తీసుకోవడానికి వీలు లేదు.‌ నారా లోకేష్ కోసమే అంజుమన్ భూమిని తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. మతాలకు సంబంధించిన ఆస్తులను ఆయా వర్గాల అభ్యున్నతి కోసం మాత్రమే వినియోగించాలి. నారావారిపల్లెలో ఖర్జూర నాయుడు ఆస్తులు ఉంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చుకోండి.‌ హెరిటేజ్ ఆస్తులను ఉచితంగా ఇచ్చుకోండి. మా ఆస్తుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోము. అంజుమన్ భూమిని తీసుకుని ఆలోచన తక్షణమే విరమించుకోవాలి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గతంలో అంజుమన్ ఆస్తులు గురించి ఏం మాట్లాడారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాజీ మస్తాన్ వలీ, సీపీఐ నాయకులు షేక్ వలీ తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker