Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలి

MINISTER NARAYANA PRESS MEET

రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలని నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. బుధవారం బుధవారం గుంటూరు విచ్చేసిన మంత్రి, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పలనాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, శాసనసభ్యులు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్ తో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ అంశాలను చర్చించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో అనేక సంస్థలకు స్థలాలను కేటాయించడం జరిగిందని చెప్పారు. రైతుల భూమికి విలువ పెరగాలని, అందుకు ఆర్దిక కార్యకలాపాలు పెరగాలని అన్నారు. రాజధాని ప్రాంతంలో 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి క్రీడానగరం అభివృద్ధి కావాలని అన్నారు తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు. ఈ విషయాలు పట్ల సి.ఆర్.డి.ఏ కమిషనర్, అదనపు కమిషనర్, కలెక్టర్లు, శాసనసభ్యులతో చర్చించామన్నారు. భూ సేకరణలో సమస్యలను ప్రభుత్వం దృష్టికీ తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు. త్రీ మెన్ కమిటీ సూచనల మేరకు చర్యలు చేపట్టాలని తెలియజేయడం జరిగిందన్నారు. తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు సంబంధిత అధికారుల నియామకం జరగాలని కోరినట్లు చెప్పారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ లో గరీబ్ భూములు గ్రామ కంఠాలు, వాస్తు మేరకు ప్లాట్ లు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయని వాటిని అధిగమించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. పొరపాట్లు గతంలో జరిగి ఉంటే వాటిని సరి చేయుటకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ నవంబర్ 28న రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కు క్యాబినెట్ ఆమోదం లభించిందన్నారు. ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయుటకు అవసరమగు అన్ని ఏర్పాట్లను కోసం చర్చించడం జరిగిందన్నారు. డిసెంబర్ ఐదో తేదీ నుండి గ్రామస్థాయిలో కార్యాలయాలు పనిచేయడం జరుగుతాయన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker