chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: పారదర్శకంగా యూరియా సరఫరా, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలించ లేదు

AP MINISTER ACHAM NAIDU STATMENT

రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరా, పంపిణీని ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తోందని వ్యవ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి అవసరమైనంత యూరియా సమయానికి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామ‌ని అన్నారు. రాష్ట్ర‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ వ్యవస్థను పర్యవేక్షిస్తూ, ఎక్కడా కొరత తలెత్తకుండా తగినన్ని నిల్వలు సిద్ధం చేశామ‌ని, ఏవైనా అవకతవకలు లేకుండా రైతులకు నేరుగా యూరియా చేరేలా కఠిన చర్యలు చేపడుతున్నామ‌ని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనమే ప్రభుత్వ లక్ష్యమ‌ని, యూరియా సరఫరాలో అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శక విధానాన్ని అమలు చేస్తూ, ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామ‌ని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యూరియా సమృద్ధిగా లభ్యమవుతుందని, త‌ప్పుడు క‌థ‌నాలు, మాటలు న‌మ్మోద్ద‌ని సూచించారు. యూరియా సరఫరా లో గత వైసిపి ప్రభుత్వం కన్నా 48,478 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు పంపిణీ చేశామ‌ని మంత్రి తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలించామనే వార్త పూర్తిగా అవాస్తవమ‌ని అన్నారు. గత ప్రభుత్వం లో మార్క్ ఫెడ్ ద్వారా సొసైటీలకు ఎరువుల సరఫరా నిర్వీర్యం చేస్తే కూట‌మి ప్రభుత్వం మార్క్ ఫెడ్ ను గాడిలో పెట్టి సొసైటీలకు అధిక మొత్తంలో యూరియా సరఫరా చేసి గ్రామీణ రైతాంగానికి అందుబాటులో ఉంచిన విషయం గుర్తించాలని తెలిపారు. గతానికి భిన్నంగా మార్క్ ఫెడ్ : ప్రైవేట్ పంపిణీ నిష్పతి ని 50 : 50 నుండి 70:30 పెంచామ‌ని, మార్కె ఫెడ్ ద్వారా (ఆర్ ఎస్ కే, పీఏసీఎస్) 20% ఎక్కువ‌గా యూరియాను పంపిణీ చేసిన ఘ‌న‌త కూట‌మి ప్ర‌భుత్వానిది ద‌క్కుతుంద‌న్నారు. 2021- 22 నుండి 2023 – 24 వరకు గత వైసిపి మూడు సంవత్సరాల సరాసరి యూరియా సరఫరా కేవలం 1,55,617 మెట్రిక్ టన్నులు కాగా ఈ ఒక్క సంవత్సరం(2025- 26)లో ఆగస్టు చివరి నాటికి 2,04,096 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేసామని అన్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం యూరియా సరఫరా 31% శాతం గతం కంటే ఎక్కువ అని తెలిపారు. ఏ ఒక్క రైతుకు యూరియా అందని పరిస్థితి రాకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షఅని, రైతు శ్రేయస్సు కూటమి ప్రభుత్వం ల‌క్ష్యం అని అన్నారు. విజిలెన్స్ రెవెన్యూ అధికారుల నిరంతర నిఘా, క్రమం తప్పని తనిఖీల ద్వారా అందుబాటు ధరలోనే మార్కెట్ లో యూరియా ల‌భిస్తుంద‌ని, ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేదని స్ప‌ష్టం చేశారు.

Author

  • AP LATEST NEWS: పారదర్శకంగా యూరియా సరఫరా, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలించ లేదు

    Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker