ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: 2026 డిసెంబర్ నాటికి పునరావాసం… 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి

AP CM VISIT POLAVARAM

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

‘పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 2027 నాటికి పునరావాసం పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నాం. వీలైతే పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తాం. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, 2026 డిసెంబర్‌కే పునరావాసం కల్పించo కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అధికారులను కోరుతున్నా. అందుకు అవసరమైన సిబ్బందిని ఇస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు గురువారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఖర్చుచేసే ప్రతిపైసా నిర్వాసితులకే చెందాలి 2014లో మేము అధికారంలోకి రాకముందు నిర్వాసితులకు చాలా తక్కువ పరిహారం ఇచ్చారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రూ.4,311 కోట్ల పరిహారం చెల్లించాం. కానీ 2019లో వచ్చిన ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీ గురించి ఆలోచించడం కానీ, పట్టించుకోవడం కానీ చేయలేదు. కనీసం మీ సమస్యల పట్ల ఆలోచించిన దాఖలాలు కూడా లేవు. పోలవరం పూర్తవ్వాలంటే తెలంగాణలోని 7 ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయాలని అప్పట్లో ప్రధాని మోదీని ఒప్పించాం. వీలైనంత వరకు మీకు న్యాయం చేసి ఆదుకోవాలని ముందుకెళ్లాం. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల అకౌంట్లో రూ.829 కోట్లు జమ చేశాం. 2014-19 మధ్య మా ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదని ప్రతిపక్షంలో ఉన్న జగన్ రూ.10 లక్షలు పరిహారం ఇస్తానన్నాడు…ఇచ్చాడా.? ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఒక్కపైసా బాధితులకు రూపాయి కూడా ఇచ్చింది లేదు. కనీసం వరదలు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. మళ్లీ రానున్న రోజుల్లో మీ దగ్గరకు వచ్చి అది చేస్తాం… ఇది చేస్తాం అని చెప్పి మీ వద్దకు వస్తారు. గత పాలకులు పోలవరం ప్రాజెక్టుకు ఏ గతి పట్టించారో చూశాం. 2019లో మా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండుంటే 2020కి ప్రాజెక్టు పూర్తయ్యేది. ఆలస్యం చేయడం వల్ల ఖర్చు భారీగా పెరిగిపోయాంది. రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్ కడితే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయింది. ఇప్పుడు మళ్లీ రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రంవాల్ నిర్మిస్తున్నాం. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృథా చేశారు. ఖర్చు పెట్టే ప్రతిపైసా మీకే చెందాలి. ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఖర్చు చేయాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker