
గుంటూరు రూరల్ వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరై వాటర్ షెడ్ మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలమే జీవనం, జలం లేకుండా జీవనం లేదు, మట్టి లేకుండా వ్యవసాయం లేదు. అందుకని నీటిని, మట్టిని కూడా కాపాడుకోవాలి. కోత్త చెరువులు తవ్వటమే కాక, పాత చెరువులను కూడా బాగుచేస్తాము. వాటర్ షెడ్ పధకం, ప్రధానమంత్రి సించాయీ యోజన నీరు, మట్టిని రక్షించటానికి వరప్రదాయినులువాటర్ షెడ్ మిషన్ కింద చెక్ డ్యాంలు, స్టాక్ డ్యాంలు వంటి అనేక నీటి వనరులు రీఛార్జి అయ్యాయి. రైతులకు ఎంతో లబ్ది చేకూరింది. వారి ఉత్పాదకత పెరిగింది. సంవత్సరానికి ఓక పంటనుండి రెండు పంటలకు వచ్చారు. దేశంలో 150 సంవత్సరాల పురాతన నీటి చెరువులు కూడా ఉన్నాయి. అవి ఇంతకుముందు నిరుపయోగంగా ఉన్నాయి. నీరు ప్రజలకు ఉపయోగపడలేదు. వెంగళాయపాలెం నీటి చెరువును కోటి 20 లక్షల రూపాయలతో అభివృధ్దిలోకి తెచ్చినందుకు వెంగళాయపాలెం అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులను అభినందిస్తున్నాను. దీనిలో స్వఛ్చమైన నీరు వచ్చింది. చేపలు కూడా పెంచవచ్చు. గ్రామాంలోని పశువులు తాగటానికి కూడా ఉపయోగపడుతుంది. భూగర్భజలాలు పెరుగుతాయి. చంద్రశేఖర్ విజనరీ లీడర్. సస్టైనబుల్ మోడల్ అంటే ఏంటో చూపించారు. 350 కోబ్బరిచెట్లు నాటారు. దీనివల్ల చెరువు నిర్వహణ జరుగుతుంది. ఉదయపు నడకకు, ఓపెన్ ఎయిర్ ధియేటర్ తో వినోదానికి, జిమ్ లో ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఢిల్లీలో జరగిన దుర్ఘటన లో మన సోదర సోదరీమణులను కోల్పోయినందున సంబరాలు చేసుకోవటంలేదు. ఓక చెరువును ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చో చెప్పటానికి ఇది ఓక ఉదాహరణ. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మోదీ ఇద్దరూ విజనరీ నాయకులు. బిజెపి, టిడిపి, జనసేన సమ్మేళనం ఉంగరంపైన ఉండే మూడు పాములలాగా పెనవేసుకుపోయింది. చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వోతముఖాభివృధ్ది చెందుతోంది. ప్రధాని మోదీ మాకు స్ఫూర్తిస్ధానిక శాసననసభ్యులకు, జిల్లా యంత్రాంగానికి నా అభినందనలు అని చెప్పారు.







