Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

AP lo roads ku : ఏపీలో రోడ్లకు రూ.358.82 కోట్లు – చౌహాన్ గారి ప్రకటన


గుంటూరు :వెంగళాయపాలెం:11-11-25:-ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు కేటాయించింది. రూ.358.82 కోట్లతో 97 గ్రామీణ రహదారులు, 33 వంతెనల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రకటించారు.గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో జాతీయ వాటర్ షెడ్ మహోత్సవం సందర్భంగా చెరువును జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆమోద పత్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి డీ.ఓ.లేఖ రూపంలో అందజేశారు.

ప్రధానమంత్రి జన్ మన్ పథకం కింద మంజూరైన ఈ ప్రాజెక్టులు ప్రధానంగా ప్రత్యేకంగా బలహీన గిరిజన వర్గాలు (PVTGs) నివసించే ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నాయి. రహదారులతో పాటు విద్యుత్‌, ఆరోగ్య సేవలు, అంగన్‌వాడీ సదుపాయాల అందుబాటును పెంచుతాయని చౌహాన్ తెలిపారు.ఈ ప్రాజెక్టులు సర్వతోముఖ అభివృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. మంజూరు పత్రాల జారీ తేదీ నుండి 7 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, 2025-26 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సువర్ణ ఆంధ్ర – వికసిత భారత్ దిశగా గ్రామీణ జీవితాలను మారుస్తున్నాయని మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అభినందించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button