AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దారి చూపే దార్శానికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
AP CM CHANDRABABAU BIRTHDAY
సీఎం చంద్రబాబు నాయుడి 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ రికార్డే అని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు సాధించిన విజయాల్ని తరచి చూస్తే వాటి వెనుక ఎన్నో త్యాగాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి. అవి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలనను పరుగులు పెట్టించారు. పెట్టిస్తూనే ఉన్నారు అని పేర్కొన్నారు. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబునాయుడు తరచూ చెప్పే మాట.. చెప్పడమే కాదు దాన్ని ఆయన ఆచరణలో చూపించిన గొప్ప వ్యక్తి అన్నారు. అపార పరిపాలనా అనుభవం, దార్శనికత ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నవ్యాంధ్ర అభివృద్ధి జరిగి తీరుతుందన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కిందపడిన ప్రతిసారీ అంతే ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు.. అది ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రాసంఘాల ఏర్పాటు, రైతుబజార్ల ఏర్పాటు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. డ్వాక్రా సంఘాల విజయ గాథలు తెలుసుకోవడానికి దేశ, విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్ పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించారని గుర్తుచేశారు..