AP NEWS: మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు.
PM MODI TOUR IN AMARAVATHI
ప్రిల్:మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించేందుకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని జలవనరుల శాఖ రైతు శిక్షణా కేంద్రంలో మంత్రుల బృందం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించింది. ఈసందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమానికి వచ్చే వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో ముఖ్యంగా ఆహారం,తాగునీరు వంటి వసతుల కల్పనలో ఎంత మాత్రం రాజీ పడరాదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రధాని సభా ప్రాంగణానికి చేరుకునే రహదారులను మెరుగుపరచాలని మంత్రి కేశవ్ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ ప్రధాని పర్యటన రోజు ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని పోలీస్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు.ప్రధాని సభకు వచ్చే సామాన్య ప్రజలకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో తాగునీరు, ఆహారం వంటి సౌకర్యాలు కల్పించడంలో ఏమాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు. వరకూ చాలా గ్రామీణ రహదారులై ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.గతంలో చిలకలూరిపేట,విశాఖపట్నం లలో ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన చిన్న చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రధాని సభను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.