ఆంధ్రప్రదేశ్

AP NEWS: కన్నుల పండువగా సాగిన శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం

SRI SRINIVASA KALYANAM

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3
  • శ్రీనివాస కల్యాణానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు
  • శ్రీవారి ఆలయం నుండి సతీసమేతంగా కల్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు
  • 27 వేల మంది భక్తులు శ్రీనివాస కల్యాణం విక్షించేలా ఏర్పాట్లు.
  • అమరావతి పరిసర ప్రాంతాల నుండి శ్రీనివాస కల్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 300 బస్సులు ఏర్పాటు.
  • తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహణ.
  • కల్యాణోత్సవానికి విచ్చేసిన తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ చినజీయర్ స్వామి, అహోబిల మఠాధిపతి శ్రీ రామానుజ జీయర్ స్వామి, శ్రీ శివ స్వామి.
  • వ్యాఖ్యానం చేసిన పంచ సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్, ప్రముఖ భగవద్గీత ఉపన్యాసకులు శ్రీ గంగాధరశాస్త్రి.
  • చెన్నైకు చెందిన ప్రముఖ గాయకురాలు శ్రీమతి నిత్యశ్రీ మహదేవన్, ప్రియా సిస్టర్స్ సంకీర్తనా గానంతో తన్మయత్వంతో మునిగిన భక్తజనం.
  • 04 టన్నుల పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్, వివిధ రకాల ఫలాలతో కల్యాణ వేదిక అలంకరణ. చెరుకులు, కొబ్బరిపూత, అరటి ఆకులు, మామిడికాయలు, ఆఫ్రికన్ ఆరంజ్, గ్రీన్ ఆపిల్, రెడ్ ఆపిల్, నలుపు, ఆకుపచ్చ ద్రాక్ష, దోస, మొక్కజొన్న, తదితర ఫలాలు, నీలం ఆర్కిడ్, రెడ్ ఆంథూరియం తదితర విదేశీ జాతి పుష్పాలతో కల్యాణ వేదిక అలంకరణ.
  • విద్యుత్ కాంతులతో వెలిగిపోయిన కల్యాణ వేదిక. 17 దేవతామూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లు ఏర్పాటు. దశావతారమూర్తి, ఆభరణాల వేంకటేశ్వరుడు, మహావిష్ణువు, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, స్వామివారి పాదాలు, శంఖుచక్ర నామాలు, పద్మావతి వేంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, గోపాల కృష్ణుడు, ఆది శేషుడు, పద్మావతి ఆనంద నిలయం రూపాలతో కటౌట్లు ఏర్పాటు. ప్రవేశ ద్వారాల వద్ద స్వాగత ఆర్చీలు, రోడ్డుకు ఇరువైపులా 60 ఎల్ఈడీ తోరణాలు అలంకరణ. నమూనా ఆలయ గోపురం, ఆనంద నిలయం, ప్రాకార మండపాన్ని 05 వేల ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడీ లైట్లతో అలంకరణ. ఇందుకోసం 25 జనరేటర్స్ ఏర్పాటు. ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించేందుకు వీలుగా 18 పెద్ద ఎల్ఈడీ స్కీన్లు ఏర్పాటు.
  • టీటీడీ అన్న ప్రసాద విభాగం ఆధ్వర్యంలో అమరావతి అక్షయ ఫౌండేషన్ వారు 40వేల పులిహోర, 40వేల పెరుగన్నం, 40వేల రవ్వ కేసరి, 40వేల స్వీటు ప్యాకెట్లు భక్తులకు పంపిణీ.
  • తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన 50వేల చిన్న లడ్డూలను కల్యాణానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ.
  • భక్తులకు సేవలందించిన 1500 మంది శ్రీవారి సేవకులు. అన్న ప్రసాదం, ఆరోగ్యశాఖ, విజిలెన్స్ విభాగాలకు సంబంధించి భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో భక్తులకు సేవలందించిన శ్రీవారి సేవకులు. భక్తులకు శ్రీవారి లడ్డూ, పసుపు, కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కల్యాణోత్సవం అక్షింతలు కలిపి ఉన్న బ్యాగులను పంపిణీ చేసిన శ్రీవారి సేవకులు. భక్తులకు తిరునామధారణ చేసిన 150 మందికిపైగా శ్రీవారి సేవకులు. శనివారం సాయంత్రం నుండి గ్యాలరీల్లో ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు పంపిణీ చేసిన శ్రీవారి సేవకులు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker