Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP NEWS: కొల్లిపర లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్

MINISTER NADENDLA MANOHER

పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల కేంద్రంలోని శ్రీ జనార్ధన స్వామి వారి దేవస్థానం ( చిన్న దేవుని గుడి) సమీపంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ , జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా పాల్గొని ప్రజల నుండి 200 ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూ , నూతన రైస్ కార్డుల కొరకు దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో అందాయన్నారు. అర్జీలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి సమస్యను వారం రోజుల్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల 9 వేల 600 మందికి రూ.40 కోట్లు రూపాయలు ఎన్ టీ ఆర్ పెన్షన్ క్రింద అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే క్రొత్తగా ఒక కోటి 46 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. అర్హత కలిగిన వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొల్లిపర మండలంలో రైతులకు సంబంధించి డొంక రోడ్లు అభివృద్ధి కోసం రూ.10 కోట్లు తీసుకురావడం జరిగిందన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో మొట్ట మొదటగా కొల్లిపర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో రూ 12వేల కోట్ల నగదును జమ చేసినట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా దావులూరు అడ్డరోడ్డు నుంచి కొల్లిపర వరకు రోడ్డును విస్తరణ చేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటానికి ఇప్పటికే ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు అక్రమణకు గురైతే పంచాయతీరాజ్ శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. పారిశుధ్యం విషయంలో ప్రతి గ్రామంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. గతంలో స్పీకర్ గా ఉన్నప్పుడు రక్షిత మంచినీటి పథకానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. గ్రామాల్లో దొంగతనాలు పెరిగి పోవడం వలన పోలీసు శాఖపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దొంగతనాలు ఆరికట్టడానికి పోలీసు శాఖ ద్వారా గట్టి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. యువత గంజాయికి అలవాటుబడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. నెల రోజుల లోపులో గంజాయిని ఆరికట్టనున్నట్లు తెలియజేశారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4వేల సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

Author

  • AP NEWS: కొల్లిపర లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్

    Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button