ఆంధ్రప్రదేశ్

AP NEWS: జూన్ 21న ఘనంగా అంతర్జాతీయ యోగా డే – రెండు గిన్నీస్ బుక్ రికార్డులు , మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధన లక్ష్యంగా యోగాంధ్ర

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

విశాఖ వేదికగా ఈ నెల 21 తేదీన జరిగే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించు కుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రెండు గిన్నీస్ రికార్డులు, మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధన లక్ష్యంగా యోగా డే కార్యక్రమాన్ని తలపెట్టామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న ఈ కార్యక్రమాన్ని ప్రపంచం గుర్తించుకునేలా నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యోగా డే కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియచేశారు. 25 వేల మంది గిరిజన విద్యార్ధులు 108 నిముషాల పాటు సూర్య నమస్కారాలు చేస్తారని తెలిపారు. ఎక్కువ మంది ఒకే చోట చేయడం తో పాటు ఎక్కువ మంది ఒకే సారి సూర్య నమస్కారాలు చేసి రెండు గిన్నీస్ రికార్డులను సాధించడమే లక్ష్యం గా కార్యక్రమం జరుగుతుందన్నారు. విశాఖ లోని రామకృష్ణా బీచ్ నుంచి భోగాపురం వరకూ 26 కిలోమీటర్ల మేర విస్తృత ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. . ఆర్కే బీచ్ వేదికగా మొత్తం 3.19 లక్షల మంది ఒకే చోటు నుంచి యోగా చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. యోగా డే రోజున విశాఖ సహా రాష్ట్రంలోనూ, దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల ప్రాంతాల్లో ఒకేసారి ప్రజలు పాల్గొంటారని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ … ” యోగా డే లో పాల్గొనేందుకు 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారని అనుకున్నాం. అంచనాలకు మించి 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. మే 21 తేదీ నుంచి జూన్ 21 వరకూ నెల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాం. పర్యాటక ప్రాంతాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలతో పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ 15 వేల పైచిలుకు యోగా పోటీలు నిర్వహించాం . ఈ కార్యక్రమం నిర్వహణకు 5451 మంది మాస్టర్ ట్రైనర్లు వచ్చారు. నెల రోజుల పాటు నిర్వహించిన వేర్వేరు యోగా కార్యక్రమాలకు సంబంధించి 1,05,58,299 మందికి సర్టిఫికేట్లు కూడా జారీ అయ్యాయి. యోగాలో పాల్గొనే వారందరికీ ఆధార్ తో అనుసంధానించి ప్రతీ ఒక్కరికి క్యూ ఆర్ కోడ్ జారీ చేశాం. యోగా చేసేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. యోగా కార్యక్రమం ప్రణాళికా ప్రకారం నిర్వహించేందుకు ఒక్కో కంపార్ట్ మెంట్ కు వెయ్యి మంది చొప్పున ఉండేలా 326 కంపార్ట్ మెంట్ లు సిద్ధం చేశాం. యోగా డే లో పాల్గొనే వారందరికీ 3.32 లక్షల టీ షర్టు లు , 5 లక్షల యోగా మ్యాట్ లు సిద్ధం చేశాం. అలాగే ఉదయం పూట కార్యక్రమం జరుగుతున్న రీత్యా టాయిలెట్ల కు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరిగాయి. యోగా ఫర్ ఒన్ ఎర్త్ ఒన్ హెల్త్ అనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 9 తరగతి నుంచి విద్యార్ధులకు యోగా సిలబస్ చేర్చేలా కార్యాచరణ చేస్తాం. పాఠశాలల్లో వారానికి ఒకటీ రెండు సార్లు యోగా తరగతులు ఉండేలా ఆలోచన చేస్తున్నాం. యోగా డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుపైనా ఆలోచన చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. జూన్ 21 తేదీ ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకూ యోగా డే కార్యక్రమం జరుగుతుందని సీఎం వివరించారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker