AP NEWS: బర్లీ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం – మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు నిర్ణయం
పొగాకు సాగు.. ఏళ్లుగా ఇదే వారి జీవనాధారం. ఆరుగాలం శ్రమించి.. వేలాది ఎకరాల్లో పండించి.. తీరా పంట చేతికొచ్చే సమయానికి ధర లేకపోతే.. గిట్టుబాటు కాకపోతే.. మధ్యవర్తులు నిలువునా ముంచేస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. కుటుంబాన్ని పోషించుకోలేక.. కష్టాన్ని రోడ్డుపై వదిలేయలేక.. వచ్చిందే చాలనుకునేవారు కొందరైతే.. ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు. ఇలా దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాది రైతన్నల దీనావస్తను చూసి చలించిపోయిందో హృదయం. వారికి అండగా నిలవాలని పరితపించింది. తన సంకల్పబలంతో ప్రభుత్వాన్ని కదిలించింది. పొగాకు మొత్తాన్ని ప్రభుత్వమే కొనాలన్న సంచలన నిర్ణయానికి కారణమైంది. పేదోడి కష్టం తెలిసిన ఆ సున్నిత హృదయం పేరే.. ఏలూరి సాంబశివరావు. దశాబ్దాలుగా పర్చూరు ఎమ్మెల్యే గా కొనసాగుతున్న ఆయనకు.. అక్కడి రైతుల కష్టం తెలుసు.. బర్లీ కొనుగోళ్లలో దళారులు చేస్తున్న మోసం తెలుసు.. అమాయక రైతుల ఆవేదనా తెలుసు. అందుకే.. కూటమి ప్రభుత్వం రాగానే.. రైతులను ఆదుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు, వ్యవసాయ శాఖ మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు స్నేహ హస్తం… అధికారుల సహకారంతో సాధించారు.. ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని అన్నదాతలకు అండగా నిలిచేలా సంచలన చరిత్రకు శ్రీకారం చుట్టారు.. వేలాది కుటుంబాల్లో ఆనందం నింపారు.