
గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయి. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టింది. 68 పనులకు సంబంధించి 42360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయి. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీయే కు కేటాయించింది. గతంలో అనంతవరం కొండను సీఆర్డీయే కు కేటాయించారు…అయితే గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారు. ఇక్కడ భూమిని కూడా ఏదోక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నాం. రాజధాని లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది సీఎం చంద్రబాబు గారి ఆలోచన. మంగళగిరి,తాడేపల్లి,గుంటూరు,విజయవాడ లను కలిపి మెగాసిటీ గా చేయాలనేది లక్ష్యం. ఎయిర్పోర్ట్ కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరం. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే 30 వేల ఎకరాలు అవసరం. భూసేకరణ చేస్తే రిజిస్ట్రేషన్ ధర పై రెండున్నర రెట్లు మాత్రమే వస్తుంది. భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని…సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే లు కోరారు. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ








