AP NEWS: రాబోయే కాలంలో ఏఐ, ఐటీ, క్యాంటం కంప్యూంటింగ్ లకు కేరాఫ్ గా అమరావతి
AP MINISTER PARDHASARADHI
అమరావతి పునః ప్రారంభ సభ చాలా గొప్పగా విజయవంతం అయ్యిందని అందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషించారని సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ ల మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. బందరు రోడ్డులో గల మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిని దేవతల రాజధాని అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారన్నారు. దేవతలు సంచరించే చోట రాక్షసులు కూడా ఉండటం సహజమన్నారు. 5 కోట్ల మంది తెలుగువారు మద్దతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉందని మంత్రి తెలిపారు. అమరావతిని భవిష్యత్తులో ఏఐ, ఐటీ, క్యంటం కంప్యూంటింగ్ లకు కేంద్రంగా వర్థిల్లే ముఖ్యమంత్రి చేస్తారన్నారు. రూ. 58,000 కోట్ల అభివృద్ధి పనులకు నిన్న ప్రధాన మంత్రి వేదిక నుంచి ప్రారంభించారన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తమ అనుభవంతో గాడిలో పెట్టగలరని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు రాజధాని ప్రజలను నానా రకాలు గా ఇబ్బంది పెట్టి, అమరావతి ప్రజలను భయపెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ను చూసి స్ఫూర్తి పొందానని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అనటం ముఖ్యమంత్రి గొప్ప పనితనానికి నిదర్శనమన్నారు. దేశాన్ని గాడిలో పెట్టిన ఏకైక ప్రధాని మోదీ అని అన్నారు. పహల్గామ్ ఉగ్రమూకల దాడి విషయంలో ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. అమరావతిని భ్రమరావతి అని గత పాలకులు విమర్శలు చేశారన్నారు. అమరావతి పునః ప్రారంభానికి ఆహ్వానించినా గత పాలకులు రాలేదన్నారు. గత పాలకులు అమరావతి ప్రాధాన్యతను అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలన్నారు. అమరావతి పునః. ప్రారంభ పనులు చాలా గొప్పగా మొదలయ్యాయన్నారు. అమరావతి పై విషం చిమ్మిన గత పాలకులు, స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలన్నారు. అలా చేస్తే తెలుగు ప్రజలు క్షమించక పోయినా దేవుడు అయినా వారిని క్షమిస్తాడేమోనన్నారు. పోలవరుం ప్రాజెక్టు పూర్తితోపాటు, పోలవరం బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టు కూడా సాధ్యమేనని ముఖ్యమంత్రి నిరూపించారన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తారన్నారు.