ఆంధ్రప్రదేశ్

AP NEWS: విజయవంతమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. తాడేపల్లి నుంచి ఉదయం బయలుదేరిన జగన్ రోడ్డు మార్గాన సత్తెనపల్లి చేరుకున్నారు. జగన్ కి స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇందులో భాగంగా సత్తెనపల్లి పట్టణం జన సంద్రమైంది‌.
కిలోమీటర్ల పొడవునా జనమే కనిపించారు. ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. ప్రభుత్వ ఆంక్షలు జగన్ పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేక పోయాయి. పోలీసుల చెక్ పోస్టులు దాటుకుని రెంటపాళ్ల వైపు జనం కదిలారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.
అదేవిధంగా స్థానికంగా ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.
ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పల్నాడు సరిహద్దుల్లో భారీ ఎత్తున పోలీసులు బారీకేడ్లు అడ్డుపెట్టారు. వాహనాలు, కార్యకర్తల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బారికేడ్లను తొలగించాలని అంబటి రాంబాబు పోలీసుల్ని కోరారు.
బారికేడ్లు తొలిగించేది లేదని పోలీసుల చెప్పడంతో అంబటి రాంబాబు పోలీసులతో వ్వాగాదానికి దిగారు. స్వయంగా అంబటి బారీకేడ్లు తొలగించి కార్యకర్తల వాహనాలను పంపారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker