ఆంధ్రప్రదేశ్

AP NEWS: వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించే స్థాయిలో ముందు వరుసలో మన రాష్ట్రం: డిల్లీ రావు వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్.

AGRICULTURE SEMINOR

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం లో భారత ప్రభుత్వము నిర్వహించిన ప్రధానమంత్రి ఫాసల్ భీమా యోజన రెండు రోజుల జాతీయ సమీక్ష సమావేశం నేటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున వ్యవసాయ సంచాలకులు ఎస్. డిల్లి రావు ఈ నెల 18 మరియు 19 తేదీలలో జరిగిన జాతీయ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది అధ్యక్షత వహించగా, వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు, బీమా సంస్థల ప్రతినిధులు మరియు ఇతర భాగస్వాములు హాజరయ్యారు. రెండవ రోజున జరిగిన ఈ పథకంలో సాంకేతిక వినియోగం , అమలు పై జరిగిన ముఖాముఖి చర్చలో డిల్లి రావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఫాసల్ భీమా యోజన పథకం అమలులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక అంశాలను వినియోగిస్తూ అమలు పరుచటములో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు . దిగుబడి అంచనా కొరకు ఉపగ్రహ సాంకేతికత ద్వారా యస్ టెక్ YES-Tech సాంకేతిక విధానం, వాతావరణ ఆధారిత బీమా అంచనాల కొరకు విండ్స్ సాంకేతిక అంశం WINDS మరియు భవిష్యత్ కార్యాచరణ పై చర్చా కార్యక్రమంలో వివ రించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాదికారులు,రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ,వివిధ భీమా సంస్థల ప్రతినిధులు ,నిపుణులు పాల్గొన్న ఈ ముఖాముఖి చర్చా కార్యక్రమంలో,ప్రధాన మంత్రి ఫాసల్ భీమా యోజన పథకం రైతులకు మరింత సులభతరంగా చేరువఅవ్వటానికి , పరిధిని పెంచుకోవటానికి తీసుకోవాల్సిన చర్యలు,వివిధ రాష్ట్రములలో పంటల భీమా అమలు తీరు ,మార్గదర్శక నియమాలలో సవరణలు , ఆధునీకరించవలసిన అంశములపై చర్చించారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker