Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

AP NEWS: శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

MINISTER LOKESH VISIT TEMPLE

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం కంఠంరాజ కొండూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పున:ప్రతిష్ట మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు, స్థానిక నాయకులు మంగళవాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ పున:ప్రతిష్టను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి లోకేష్ రాకను పురస్కరించుకుని స్థానిక ప్రజానీకం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షురాలు కేసమనేని అనిత తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button