AP NEWS: సమన్వయంతో మహిళకు కావాల్సిన అవసరాలను తీర్చగలితే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చు : జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్
ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళకు కావాల్సిన అవసరాలను తీర్చగలితే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చు అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జన్ సున్వై పై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, ఎస్ పి హర్ష వర్ధన్ రాజు , అర్చన మంజుదార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ.. ప్రారంభ దశలో వివిధ శాఖల సమన్వయంతో మహిళకు కావాల్సిన అవసరాలను తీర్చగలితే వారి మీద జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చు అని తెలిపారు. ప్రతి శాఖలోనూ అంతర్గత మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. పని చేసే ప్రదేశాలలో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించాలంటే ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లు పోష్ యాక్ట్ ను పటిష్టం చేయాలన్నారు. ప్రతి సమస్యలను మహిళలకు సంబంధించిన ప్రతి సమస్య జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తుందని తెలిపారు. మహిళలపై నేరాలు ఎక్కువ కావడానికి కారణం సరైన అవగాహన లేకపోవడం భద్రత కలిగించకపోవడం ప్రధాని కారణమని తెలిపారు. అన్ని రకాల గా మహిళలకు రక్షణ కల్పించడం వలన నేరలను తగ్గించవచ్చును తెలిపారు ఇతర రాష్ట్రాలలో బాల్య వివాహాలు జరగడం వలన యుక్త వయసులోని గర్భం దాల్చడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసి అరికట్టే దిశగా.. కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జాతీయ మహిళా కమిషన్ సూచనలు క్రమం తప్పకుండా పాటించి లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో జిల్లాలో మహిళల పై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా.. కృషి చేస్తామని తెలిపారు. మహిళల్లో ఆర్థిక సాధికారత సాధించినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని తెలిపారు. జిల్లాలో నీ గ్రామ/ వార్డు సచివాలయం మంచి సిస్టమ్ ఉందని, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీస్ అందుబాటులో ఉంటారని తెలిపారు. వీరందరూ కూడా మహిళలపై జరుగుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. లైన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మహిళల సమస్యలను పరిష్కరించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము అని తెలిపారు.