ఆంధ్రప్రదేశ్
AP POLITICAL NEWS: దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా
VIDADALA RAJINI PRESS MEET
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు నరసరావుపేట జైలులో రిమాండ్లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ ని సోమవారం ఆమె పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు గొంతెత్తే స్వాతంత్రం కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై ఉక్కుపాదంతో అణిచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.