Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP POLITICAL NEWS: నాడు సాగునీటి ప్రాజెక్టుల ధ్వంసం… నేడు ప్రగతి పథం – ఇరిగేషన్ మంత్రి నిమ్మల

AP MINISTER NIMMALA PRESS MEET

గత ఐదేళ్ల పాటు కుదేలైన సాగునీటి రంగాన్ని కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ప్రగతి పథంలో పయనింప చేస్తున్నారని సాగునీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సాగునీటి ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమిస్తోంది. 17 నెలల కాలంలోనే సాగునీటి రంగాన్ని ప్రగతి పథంలో నిలబెట్టాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సాగునీటి రంగ ఎన్నికలు నిర్వహించాం. గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు, డ్యామ్‌లు, కాలువల మరమ్మతులు, రిపేయిర్లకు కూడా నిధులు కేటాయించలేదు. సాగునీరు సక్రమంగా పారక చివరి ఆయకట్టు నీరు అందలేదు. జగన్ పాలనలో ప్రతి నియోజకవర్గంలో 5 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాల వరకు సాగు దిగుబడి తగ్గిపోయింది. వ్యవసాయం కుంటుపడి దిగుబడి తగ్గిపోయింది. రైతులు వలసబాట పట్టేలా జగన్ ప్రభుత్వం చేసిందని తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker