chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP POLITICAL NEWS: మెడికల్ కాలేజీల పీపీపీపై ప్రజలు ఆలోచించండి

GUNTUR MLA NASEER COMMENTS ON MEDICAL COLLEGES

మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై రాష్ట్రంలో మేధావులు ఆలోచించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు శాసనసభ్యుల కార్యాలయంలో మంగళవారం రూ.87 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.7.80 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించామని వెల్లడించారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ వైద్యంతోపాటు సీఎంఆర్ఎఫ్ ద్వారా తోడుగా నిలుస్తాన్నామన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై జగన్ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిలదీస్తారనే భయంతో సంతకాల సేకరణ డ్రామాకు తెరతీశారన్నారు. హైవే రోడ్లు, డ్యాములు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా ప్రభుత్వానికి సంబంధించిన వాటిని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తూ ఉంటామని, ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలనూ పూర్తి చేసేందుకు పీపీపీ విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు. నిర్మాణాలు పూర్తయ్యాక మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వస్తాయన్నారు. జగన్ ఐదు కాలేజీలు నిర్మించడానికి ఐదేళ్లు సరిపోలేదని, తాము రెండు, మూడేళ్లలో 19 కాలేజీలు పూర్తి చేస్తామని వెల్లడించారు. కాలేజీలు నిర్మి్స్తామని చెప్పిన వారిని జైలులో పెడతామని నిస్సిగ్గుగా జగన్ మాట్లాడటం దారుణమన్నారు. రాజ్యాంగంపైగానీ, చట్టాలపైగానీ ఎటువంటి నిబద్ధత లేదని మండిపడ్డారు. జగన్ బర్త్ డేకు పొట్టేలు కోసి ఫ్లెక్సీలపై రక్తం వేస్తుంటే, అదే తమ నాయకుడు ప్రజల వద్దకు వెళ్లి మంచి చేయాలని చెబుతున్నారని, ఈ తేడాను ప్రజలను గమనిస్తున్నారని స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker