chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

ఆస్తితో పాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లలదే

విజయవాడ, సెప్టెంబర్ 17:వృద్ధుల హక్కులు, చట్టపరమైన రక్షణ, వారికి అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పించేందుకు వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో, ఎస్‌బీఐ గరిమా ప్రాజెక్ట్ సహకారంతో ఒక అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మచిలీపట్నం జిల్లా న్యాయాధికార సేవా సంస్థ (DLSA) సెక్రటరీ శ్రీ కే.వి. రామకృష్ణయ్య సీనియర్ పౌరులతో ప్రత్యక్షంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “వృద్ధులు సమాజంలో గౌరవనీయులు. అయితే వయసుతో వచ్చే సమస్యలు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారి హక్కులను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆస్తులు బదిలీ చేసే సమయంలో వృద్ధులు వీలునామా లేదా బహుకరణ పత్రంలో ‘పోషణ నిమిత్తం’ అని రిజిస్టర్ చేయించుకుంటే రక్షణ లభిస్తుంది. నిరాదరణకు గురైతే వారు మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసి భరణం పొందవచ్చు. ఎవరు నేరుగా రాలేకపోతే 15100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మేము మూడు నెలల్లోపు న్యాయం జరిగేలా చూస్తాం” అని స్పష్టం చేశారు.అలాగే ఆస్తి బదిలీల్లో కేవలం కొడుకులు, కూతుళ్లు మాత్రమే కాదు – కోడళ్ళు, అల్లుళ్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదనంగా, SC, ST, మైనర్లు, వికలాంగులు, సంవత్సర ఆదాయం ₹3 లక్షల కంటే తక్కువవారికి ఉచిత న్యాయ సహాయం, అలాగే మహిళలకు వర్గం, ఆదాయం సంబంధం లేకుండా ప్రత్యేక వెసులుబాటు ఉందని తెలిపారు.వాసవ్య మహిళా మండలి ప్రతినిధి డా. కీర్తి మాట్లాడుతూ – “వృద్ధులకు మానసిక, శారీరక, ఆర్థిక భద్రత కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. గరిమా ప్రాజెక్ట్ ద్వారా వృద్ధులకు చట్టపరమైన అవగాహన కల్పించి అవసరమైన సేవలను అందించటం మా లక్ష్యం” అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు రావు, కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఏసీపీ ప్రసాద్, మహిళా సంరక్షణ కార్యదర్శులు, వాసవ్య మండలి ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వృద్ధాశ్రమ వాసులు పాల్గొన్నారు. వృద్ధులు తమ సమస్యలు పంచుకోగా, న్యాయవేత్తలు వాటి పరిష్కార మార్గాలను సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker