
ఆధిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (Deemed to be University) లో నిర్వహించిన “Cloud Computing with DevOps” స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమం 6 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించబడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విద్యార్థులను ముందుకు నడిపించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

23-02-2026 నుండి 28-02-2026 వరకు మొత్తం 36 గంటలపాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని DevOps ట్రైనర్ శ్రీ రోషిత్ నూర్బాషా గారు నిర్వహించారు.
ఈ శిక్షణలో Linux Fundamentals, Git & GitHub, Cloud Infrastructure, AWS, GCP, DevOps Concepts, CI/CD Pipeline, Docker, GitHub Pages Deployment వంటి ముఖ్య అంశాలను సిద్ధాంతంతో పాటు ప్రాక్టికల్ హ్యాండ్స్-ఆన్ సెషన్ల ద్వారా విద్యార్థులకు బోధించారు. ముఖ్యంగా విద్యార్థులు తమ స్వంత HTML ప్రాజెక్టులను GitHub లో పుష్ చేసి, GitHub Pages ద్వారా లైవ్ వెబ్సైట్లుగా హోస్ట్ చేయడం నేర్చుకోవడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇలాంటి ప్రాక్టికల్ ఆధారిత శిక్షణ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో టెక్నికల్ నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడం కాలేజ్ యాజమాన్యం యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంది.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం గారి మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహం లభించింది. డీన్ ఆఫ్ SET డా. ధనుంజయ గారు, CSE (AI & DS) విభాగాధిపతి డా. బి.వి.ఎస్ ఉమా ప్రత్యూష గారు, డీన్ అకాడెమిక్స్ డా. బ్రింద గారు, అలాగే CSE విభాగ అధ్యాపకులు నజీర్ బాషా గారు మరియు ఇతర అధ్యాపకులు ఈ కార్యక్రమానికి విశేష సహకారం అందించారు.

ఆడిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యా ప్రమాణాలు, సాంకేతిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమ అనుసంధానం మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ విద్యాసంస్థగా ఎదుగుతోంది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమ నిపుణుల శిక్షణలు మరియు ప్రాక్టికల్ ఆధారిత బోధన ద్వారా విద్యార్థులను భవిష్యత్ సాంకేతిక రంగానికి సిద్ధం చేస్తోంది.
విద్యార్థులు ఈ కార్యక్రమంపై తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూ, DevOps మరియు Cloud Computing రంగాల్లో తమ కెరీర్ను నిర్మించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధునిక శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కాలేజ్ యాజమాన్యం నిర్ణయించింది.







