ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: మే నెలలో తల్లికి వందనం పథకం అమలు

MINISTER LOKESH STATMENT IN ASSEMBLY

తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. “తల్లికి వందనం’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తాం. బడ్జెట్లో 9407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. గత ప్రభుత్వంలో దీనికి ఏడాదికి 5,540 కోట్లు కేటాయించారు, గతంతో పోలిస్తే ఇది 50శాతం అధికం. ఎన్నికలకు ముందు సూపర్-6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం” అని లోకేశ్ స్పష్టం చేశారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button