Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 సికింద్రాబాద్

Auto meter charge lu :ఆటో మీటర్ చార్జీలు వెంటనే పెంచాలి-తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ యూనియన్

సికింద్రాబాద్ :26-11-25:-మానవ హక్కుల కమిషన్ తాజా ఆదేశాల నేపథ్యంలో ఆటో మీటర్ చార్జీలను వెంటనే పెంచాలని తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. తిరుమలగిరిలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్ మాట్లాడారు.గత 11 ఏళ్లలో బస్ చార్జీలను ఆరు సార్లు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను మూడు దఫాలు పెంచినప్పటికీ, ఎమ్మెల్యేలు తమ జీతాలను ఒకేసారి మూడు వందల శాతం పెంచుకున్నప్పటికీ… ఆటో మీటర్ చార్జీలు మాత్రం ఏకసారి కూడా సవరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Auto meter charge lu :ఆటో మీటర్ చార్జీలు వెంటనే పెంచాలి-తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ యూనియన్

అనేక మార్లు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా వర్గాల రాజకీయ ప్రయోజనాల కారణంగా పెంపు అమలులోకి రాలేదని తెలిపారు. ఇటీవల మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని శివానంద్ వివరించారు.అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల ఆచరణ సూత్రాల కారణంగా ఈ నిర్ణయం జనవరి నెలలోనే అమలు కావచ్చని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని రాజకీయంగా మలుచుకునే కొన్ని సంఘాలు ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకు రావాలని ప్రేరేపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. ధర్నాలు, లాఠీచార్జీలకు ఆటో డ్రైవర్లు గురి కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.“వారి మాటలు విని మోసపోవద్దని, నిజమైన నిర్ణయం ప్రభుత్వము తీసుకునే వరకూ సహనం పాటించాలని” ఆటో డ్రైవర్లను కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker