
విశాఖపట్నం, మార్చి 9:– రాబోయే తరాల మహిళల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా విశాఖ జిల్లా యంత్రాంగం కీలక ముందడుగు వేసింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) మహమ్మారి నుండి బాలికలను రక్షించేందుకు HPV వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గుర్తించిన 17,743 మంది కౌమార దశలోని బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ముఖ్యమైన సూచనలు ఇవే:
- అర్హత: 14 ఏళ్లు నిండి, 15వ ఏట అడుగుపెట్టని బాలికలందరూ ఈ ఉచిత వ్యాక్సినేషన్కు అర్హులు.
- నిర్వహణ: జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 33 కేంద్రాలలో ఉదయం పూట ఈ టీకాలు వేయబడతాయి.
- ముందు జాగ్రత్త: ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా ఆహారం తీసుకోకుండా వస్తే, కేంద్రాల వద్దే అల్పాహారం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
- పర్యవేక్షణ: టీకా వేసిన తర్వాత ప్రతి బాలికను కనీసం 30 నిమిషాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి.
“వచ్చే మూడు నెలల పాటు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి, అర్హులైన బాలికలను టీకా కేంద్రాలకు తీసుకురావాలి.” — ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జిల్లా కలెక్టర్.Visakha Local News :MILAN–2026లో భాగంగా రామకృష్ణ బీచ్ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లోపాల్గొన్నా-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాదరి గారు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారులు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యంత్రాంగం కోరింది.







