Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

An Amazing Progress of 23.75 Crores in Bapatla Development: Rapid Progress in Government Hospital Development Works||23.75 కోట్ల అద్భుత ప్రగతి: ప్రభుత్వ వైద్యశాలల్లో శరవేగంగా అభివృద్ధి పనులు

An Amazing Progress of 23.75 Crores in Bapatla Development: Rapid Progress in Government Hospital Development Works||23.75 కోట్ల అద్భుత ప్రగతి: ప్రభుత్వ వైద్యశాలల్లో శరవేగంగా అభివృద్ధి పనులు
      ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేపట్టాలని    జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. వైద్య విధాన పరిషత్ ఆధీనంలోని  ప్రాంతీయ వైద్యశాలలో అభివృద్ధి పనులపై బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు.

    ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. మెరుగైన వసతులు, సదుపాయాలకొరకు రూ.23.75 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. స్కానింగ్ సెంటర్లు, క్రిటికల్ కేర్ యూనిట్లు ఏర్పాటు పనులలో ప్రతివారం పురోగతి కనిపించాలన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు రావడంతో ప్రధానంగా చీరాల, బాపట్ల ప్రాంతీయ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఏపీఎంఐడిసి ఇంజినీరింగ్ అధికారులు ప్రతివారం కలెక్టరేట్ కు నివేదిక పంపాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ ను 2026 మే నెల నాటికి పూర్తి చేయాలన్నారు. 

      ఆర్టిజం సెంటర్, భవిత సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ప్రత్యేక అవసరత ఉన్న చిన్నారుల భవిష్యత్తు కొరకు ఆర్టిజం కేంద్రాలు ఏంతగానో ఉపకరిస్తాయన్నారు. చీరాల ఈపురుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడానికి అధికారిక అనుమతులు వచ్చాయన్నారు. బాపట్ల పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో రూ. 27.5 లక్షలతో ఆర్టిజం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇదే ప్రాంతంలో భవిత కేంద్ర ఏర్పాటుకు అనుకూలమైన భవనం, పరిస్థితులు ఉన్నాయని వివరించారు. అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

      ఈ సమావేశంలో వైద్య విధాన్ పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డా. పద్మావతి, ఏపీ ఎమ్ ఐ డి సి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button