
బాపట్ల, ఫిబ్రవరి 2, 2026:– బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారుల వినతులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ స్వయంగా విని, అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన కూడా పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ లవన్నలు అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించేలా ఆదేశాలు జారీ చేశారు.

ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఎం & హెచ్వో డాక్టర్ ఎస్. విజయమ్మ, సీపీఓ ఏ.ఎస్. రాజు, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, ఐసిడిఎస్, గృహ నిర్మాణ సంస్థకు చెందిన అధికారులు విజయలక్ష్మి, సింగయ్య, పాల్, రాధమాదవి, వెంకటేశ్వరరావు, మార్క్పేడ్ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్ఎస్ పద్మావతి, డీటీసీ పరందామ రెడ్డి, జీఎం డీఐసీ రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, డీపీఓ యల్. ప్రభాకర్ రావు, డీఈఓ శ్రీనివాస్, బీసీ మరియు గిరిజన సంక్షేమ శాఖల అధికారులు శివలీలా, అబ్బులు, డీఎల్డీఓ విజయలక్ష్మి సహా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.TODAY BAPATLA NEWS










