chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

బాపట్ల:డిసెంబరు 22 :-జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జి.ఆర్.ఎస్) కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 60 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ గారి దృష్టికి తీసుకువచ్చారు.

Bapatla Local News :బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు తదితర సమస్యలపై అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ గారు అర్జీదారులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. సంబంధిత అర్జీలను చట్టపరంగా వేగవంతంగా విచారించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీలపై తీసుకున్న చర్యల నివేదికలను జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని సూచించారు.Bapatla Local News

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజలు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో మోసాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. అధిక లాభాల ఆశ చూపిస్తూ నకిలీ వెబ్‌సైట్లు, లింకుల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు.

Bapatla Local News :బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఐపీఓలలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మిస్తారని చెప్పారు. మొదట తక్కువ మొత్తంతో నకిలీ లాభాలు చూపించి, ఆ తరువాత భారీ మొత్తాలు పెట్టుబడులు పెట్టించుకుని చివరికి డబ్బు విత్‌డ్రా చేయనివ్వకుండా మోసం చేస్తున్నారని వివరించారు.

Bapatla Local News :బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

అపరిచిత లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని, అత్యాశకు లోనై పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా మంది తమ విలువైన డబ్బును కోల్పోతున్నారని తెలిపారు. ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా https://cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. అలా చేస్తే కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ శ్రీ పి.జగదీష్ నాయక్ గారు, పీజీఆర్‌ఎస్ సెల్ మహిళా ఎస్‌ఐ లక్ష్మి రాజ్యం గారు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker