
బాపట్ల, ఫిబ్రవరి 26: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం బాపట్ల పట్టణంలో ఉత్సాహభరితంగా జరిగింది. పట్టణంలోని పటేల్ నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
BAPATLA PAWAN KALYAN PILUPUTHO,FEBRAVARY:ఈ సందర్భంగా విన్నకోట సురేష్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. ఉద్యమి సభ్యత్వం కేవలం పార్టీ గుర్తింపు మాత్రమే కాదని, ప్రతి కార్యకర్తకు రక్షణ కవచంలాంటిదని పేర్కొన్నారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు సభ్యత్వం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని, జనసేన పార్టీ తన కార్యకర్తల పట్ల ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి, బాపట్ల తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ఈసారి సభ్యత్వ నమోదు మరింత విస్తృతంగా చేపడుతున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ పిలుపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికీ వివరించి జనసేన కుటుంబాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యమి సభ్యత్వం పార్టీ తరఫున ఇచ్చే ఒక పెద్ద భరోసా అని ఆమె తెలిపారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గొట్టుపాటి శ్రీకృష్ణ, దయాసింగ్, ఏసోబు, కారుమూరి ఆంజనేయ, కొక్కిరాల రాజేంద్ర, పసుపులేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.






