
బాపట్ల, శనివారం:-బాపట్ల పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి ధీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. శనివారం ఆయన అధ్యక్షతన ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు. ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత అందరిదని ఆయన స్పష్టం చేశారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఆసుపత్రిలో నిత్యావసర మందుల కొరత తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. ప్రజలకు నమ్మకమైన వైద్యం అందించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.Bapatla Local News
ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.










