Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍బాపట్ల జిల్లా

Bapatla17 వ వార్డులో వైభవంగా వినాయక చవితి వేడుకలు

మహిళలకు చీరల పంపిణీ

బాపట్ల పట్టణం 17వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ నాయకుడు మాసా కళ్యాణ్ చక్రవర్తి నేతృత్వంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి, కమిటీ సభ్యులు 17వ వార్డు పరిధిలోని ప్రతి హిందూ కుటుంబాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, ఇంటింటికి వినాయకుని ప్రతిమలను అందజేశారు. బాపట్లలో ఇంతకు ముందెన్నడూ జరగని ఈ విధంగా వినాయకుని ప్రతిమలు పంచడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వినాయక చవితి రోజున మండపానికి విచ్చేసిన ప్రతి మహిళకు మనలి రాజా కుటుంబం తరఫున చీరలను పంపిణీ చేశారు. మనలి రాజా తనయురాలు జాహ్నవి స్వయంగా మహిళలకు చీరలు అందజేయడం విశేషం. భక్తులు మాట్లాడుతూ, మహిళలకు గౌరవం ఇస్తూ చీరలను పంచడం, అలాగే ఇంటింటికీ వినాయకుని ప్రతిమలను అందించడం శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ చేసిన ఒక గొప్ప సేవ అని అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కత్తుల మేఘనాథ్, దూళిపూడి నాగరాజు, విన్నకోట అశోక్, గంగు శిరీష్, గండికోట అంకమ్మ, భీమిరెడ్డి సూర్య, తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button