
బాపట్ల: బాపట్ల నియోజకవర్గ ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు బుధవారం ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ (P-4)లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి.. పెన్షన్లు, రేషన్ కార్డులు, డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు, భూ వివాదాలపై ఎమ్మెల్యేకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అర్జీలు స్వీకరించిన వెంటనే స్పందించిన ఆయన, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.https://youtu.be/D_DnWmFD5QQ?si=pXFMf9WXYgbXQI0a
ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాన్ని తప్పించి, పాలనను నేరుగా వారి వద్దకే చేర్చడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసిన ఆయన.. విజన్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందే వరకు విశ్రమించేది లేదని ఉద్ఘాటించారు.bapatla news







