chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 సికింద్రాబాద్

Secunderabad Local News :బిసి రిజర్వేషన్ ల కోసం ఆత్మహత్యకు యత్నించిన సాయి ఈశ్వర్ ని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ పరామర్శించారు.

సికింద్రాబాద్ :బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్‌ను శుక్రవారం మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు జాజుల శ్రీనివాస్ పరామర్శించారు.సాయి ఈశ్వర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి అడిగి తెలుసుకున్న అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు.

Secunderabad Local News :బిసి రిజర్వేషన్ ల కోసం ఆత్మహత్యకు యత్నించిన సాయి ఈశ్వర్ ని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ పరామర్శించారు.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…
“తెలంగాణలో సగం జనాభా బీసీలే. వారికి అన్యాయం చేస్తే ఏ ప్రభుత్వం అయినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. బీసీల ఓట్లతో గెలిచిన నేతలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం అసహనం కలిగిస్తోంది. యువకులు మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడకూడదు. బీసీల బిక్షతోనే ప్రభుత్వాలు నిలబడతాయి… ఈ నిజం మరిచిపోవద్దు. బీసీలంతా ఐక్యంగా పోరాడితే ఏ ప్రభుత్వం అయినా మెడలు వంచక తప్పదు,” అని హెచ్చరించారు.మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…
బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమాలు ఉధృతమవుతున్నప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ…“అగ్రకుల పాలనను బీసీలు ఇక భరించరు. బీసీ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు… ఇది దారుణం. బీసీలంతా ఒకటై పోరాడాల్సిన సమయం వచ్చేసింది,” అని అన్నారు.అదేవిధంగా సాయి ఈశ్వర్ కుటుంబానికి వెంటనే రూ. 50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వం కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker