chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Amaravathi local news: బీసీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై జాయింట్ కమిటీ సమీక్ష

అమరావతి, జనవరి 28:-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC Welfare) జాయింట్ కమిటీ సమావేశం ఈరోజు అసెంబ్లీ హాల్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి జాయింట్ కమిటీ చైర్మన్ బీద రవిచంద్ర గారు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు గారు, కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు, పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గారు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమానికి సంబంధించి అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ స్కూళ్లు, ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్, తల్లికి వందనం పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు, సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం, ఏపీ బీసీ స్టడీ సర్కిల్స్, బీసీ హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలు, బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, ఎస్.ఆర్. శంకర నాలెడ్జి సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.Amaravathi news

అలాగే బీసీలకు సంబంధించి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు పురోగతిపై కూడా సభ్యులు చర్చించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి బీసీ కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో శాసనసభ అధికారులు, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker