
టోలిచౌకి నిజాం కాలనీలో ఇటీవల చోటుచేసుకున్న భవన నిర్మాణ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు తిరుపతి, ఆదినారాయణ కుటుంబాలను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ఎమ్మెల్యే సహకారంతో ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షల చొప్పున మొత్తం రూ.16 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.

అదే సమయంలో ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల వైద్య ఖర్చులను కూడా తన సహకారంతో భరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, అలాగే గాయపడిన వారికి లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ భరోసా ఇచ్చారు.Hyderabad Local News:







