Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada Local News:భవాని దీక్షల విరమణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

విజయవాడ:నవంబర్ 08:-భవాని దీక్షల విరమణ నేపథ్యంలో, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.డిసెంబర్ 11 నుండి ప్రారంభమై డిసెంబర్ 15న మహా పూర్ణాహుతితో ముగియనున్న భవాని దీక్షల విరమణ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనానికి రానున్నారని కమిషనర్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ, క్యూలైన్లలో రద్దీ తగ్గింపు, స్నానఘాట్లు మరియు ప్రసాదం కౌంటర్ల వద్ద వేచి చూసే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భక్తులు త్వరితగతిన క్యూలైన్లలో చేరేందుకు, అవసరమైన ప్రదేశాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ఏర్పాటు అంశంపై చర్చించారు. అదేవిధంగా గిరి ప్రదక్షిణ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, వాహన పార్కింగ్ ప్రాంతాలు మరియు భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు.భవాని దీక్ష విరమణ భక్తుల సౌకర్యార్థం గత సంవత్సరం రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఆధునీకరించాలన్న కమిషనర్ సూచించారు. యాప్ ద్వారా అమ్మవారి దర్శన సమయాలు, ప్రసాదం ఆన్‌లైన్ బుకింగ్, పార్కింగ్ ప్రదేశాలు, మెడికల్ పాయింట్లు, త్రాగునీరు, సమాచార కేంద్రాలు, పూజా విధానం మొదలైన వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలని దేవస్థాన ఐటీ అధికారులను ఆదేశించారు. దీని ద్వారా భక్తులు తక్షణ సమాచారం పొందడమే కాకుండా, తమ ప్రయాణాన్ని సులభంగా పూర్తిచేయగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీ కృష్ణకాంత్ పాటిల్ ఐపీఎస్, టెంపుల్ ఈఓ శ్రీ నానాయక్, ఎడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ శ్రీ దుర్గారావు, ఇన్స్పెక్టర్ గురు ప్రకాష్, దేవస్థాన ఐటీ మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button