
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలోని దుగ్గిరాల గోపాలకృష్ణ పార్కు వద్ద ఆదికవియిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలను బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా బాపట్ల జిల్లా అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండముది బంగారు బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ.. 16వ శతాబ్దంలో తెనాలి రామకృష్ణుడి సమకాలికురాలిగా, సామాన్య కుమ్మర కుటుంబంలో జన్మించి, మృదువైన తెలుగు భాషలో ‘మొల్ల రామాయణం’ రచించిన ఆమె బీసీల ఆశాజ్యోతి అని కొనియాడారు.

రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, కోస్టల్ జోన్ ఇన్ఛార్జ్ రామకృష్ణ యాదవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాలివాహన ప్రజాపతి సంఘం పెద్దలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు డాక్టర్ తాడివలస దేవరాజు, కొక్కిలిగడ్డ శ్రీనివాస రాజు, కోట్రా రామకృష్ణతో పాటు టిడిపి, జనసేన నాయకులు మరియు శాలివాహన సంఘ ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.Chirala local News







