chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada News:వాంబే కాలనీ అండర్ బ్రిడ్జి అనుమతిపై ప్రజా పోరాటం విజయం

విజయవాడ, అక్టోబర్ 16:విజయవాడ వాంబే కాలనీ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి రావడాన్ని సిపిఎం ప్రజా పోరాట విజయంగా అభివర్ణించింది. అయితే, ప్రస్తుత డిజైన్‌లో ప్రతిపాదించిన 4-3 మీటర్ల పరిమాణం సరిపోదని, బస్సుల రాకపోకలకు అనువుగా బ్రిడ్జి వెడల్పును కనీసం 10 మీటర్లకు పెంచాలని, ఎత్తు సరిచేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు నేడు వాంబే కాలనీ రైల్వే లైన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సెంట్రల్ సిటీ నాయకులు బి. రమణారావు, కే. దుర్గారావు, ఇతర ప్రజాసంఘాల నాయకులు టి. ప్రవీణ్, ఎస్.కే. పీర్ సాహెబ్, సిహెచ్ శ్రీనివాస్, రత్నకుమారి, బి. రాంబాబు, అప్పన్న, రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుత డిజైన్ ప్రజలకు అనర్ధమేఈ సందర్భంగా మాట్లాడిన బాబురావు మాట్లాడుతూ, “గత రెండు దశాబ్దాలుగా స్థానికులు, సిపిఎం కలిసి పోరాటం చేసిన ఫలితంగా ఈ అనుమతి వచ్చిందని ఇది నిజమైన ప్రజా విజయమే. కానీ 4-3 మీటర్ల పరిమాణంలో అండర్ బ్రిడ్జి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదు. గతంలో అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కింద నిర్మించిన సబ్ వే ప్రయోజనకరం కాకపోయింది. మళ్ళీ అదే తప్పు చేయకూడదు” అని అన్నారు.బస్సులకు, భారీ వాహనాలకు అనువుగా కనీసం 10 మీటర్ల వెడల్పుతో, ఎత్తు పెంచిన డిజైన్ రూపొందించాలని, తగిన నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పాలాభిషేకాలు కాదు – నిర్మాణ పనులపై దృష్టి పెట్టండి“ప్రజాప్రతినిధులు పాలాభిషేకాలు, ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగించేలా అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించి, పనులు ప్రారంభించాలి. లేకపోతే సిపిఎం ఆందోళనలు కొనసాగుతాయి” అని సిపిఎం నేతలు హెచ్చరించారు.ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కనకదుర్గ వారధి నుండి నూజివీడు రోడ్డు వరకు వాహనాల రాకపోకలు సులభమవుతాయని, ప్రయాణ సమయం తగ్గి ప్రజాధనం ఆదా అవుతుందని వారు వివరించారు. నేటి ధర్నాలో వందలాదిగా స్థానికులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker